విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
వర్గల్ సెప్టెంబర్ 03 ప్రజాస్వరం.
సిద్దిపేట జిల్లా వర్గల్ మండల్ దండుపల్లి గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మాల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. వారితో పాటు సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు బైరి శంకర్, వర్గల్ మండల్ అధ్యక్షులు బొల్లిపల్లి తిరుపతి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆ అమ్మవారు ప్రజలందరినీ చక్కగా చూడాలని నల్లపోచమ్మ, ముత్యాలమ్మ విగ్రహాలను ప్రతిష్టించుకొని పూజలు నిర్వహిస్తున్న గ్రామస్థులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.ప్రతి గ్రామంలో బొడ్రాయిని కూడా సీతాలమ్మ తల్లి అని పూజిస్తాం అని చెప్పారు.భారత సాంప్రదాయం చాలా గొప్పదిని, స్త్రీలను గౌరవించడం మాత్రమే కాదు వారే దేవతలుగా పూజించుకుంటాం అన్నారు. మైసమ్మ, ముత్యాలమ్మ, సీతలమ్మ అందరూ తల్లులే మనలని కాపాడుతారాని చెప్పారు.భుమిని కూడా భూతల్లిగా పూజిస్తాము.అమ్మవారి అనుగ్రహం మనందరి మీదా ఉండాలని కోరుకుంటున్నారాని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, నాయకులు శ్రీకాంత్, శంకర్ గౌడ్, యాదగిరి, రాజు, గ్రామస్థులు జంగం రాజు,జంగం యాదగిరి,నర్సింళ్లు, కాస మహిపాల్, కాస బాలరాజ్, తదితరులు పాల్గొన్నారు.


