సంగారెడ్డి లో జర్నలిస్టుల ఆందోళన
సంగారెడ్డి (ప్రజాస్వరం) :
జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252 ను వెంటనే సవరించాలని సంగారెడ్డి జిల్లా టియుడబ్ల్యూజే H 143 జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అక్రిడేషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని మానుకోవాలని సంగారెడ్డి కలెక్టరేట్ ముందు ఆందోళన దిగారు. అనంతరం ఆడిషినల్ కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ..
గత ప్రభుత్వ హయాంలో లో 23 వేల అక్రెడిటేషన్ కార్డులివ్వగా, కొత్త జీవోతో అవి 10 వేలకు పైగా కార్డులకు కోత పడే ప్రమాదం ఉందని జర్నలిస్ట్ లు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్లకు ఒక కార్డు ఉండేదని... ఇప్పుడు అది రద్దు చేసి.., స్టేట్, జిల్లా, మండలస్థాయిలో మాత్రమే కార్డులివ్వాలని నిర్వహించడం దారుణమన్నారు.
గతంలో జనరల్, స్పోర్ట్స్, కల్చరల్, ఫిల్మ్, కార్టూనిస్టులకు ప్రత్యేక కోటా ఉండేదని, ఇప్పుడీ కోటాను రద్దుచేసి, ఫ్రీలాన్స్ కోటాలో... అదీ కార్టూనిస్టులకే పరిమితం చేశారని, దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.రాష్ట్రస్థాయి అక్రెడిటేషన్ కు డిగ్రీ విద్యార్హత లేదా ఐదేండ్ల అనుభవం ఉండాలని, జిల్లా, మండలస్థాయి రిపోర్టర్లకు ఇంటర్మీడియట్ విద్యార్హత తప్పనిసరి చేశారని, కానీ వీరి అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. గతంలో ఆటో డ్రైవర్లకు, సర్పంచ్ లకు, పార్టీ కార్యకర్తలకు ఇచ్చే విధానాలకు ప్రభుత్వం స్వస్తి పలకాలని కోరారు. ఇది వరకు పట్టణ ప్రాంతాలు, మండలాల్లో 50 వేల జనాభాకు ఒక అక్రెడిటేషన్ కార్డు చొప్పున ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మండలానికి ఒక కార్డు మాత్రమే ఇస్తారని ఆ జీవోలో పేర్కొనటం సరికాదని అన్నారు.
కేబుల్ చానళ్లకు జిల్లా స్థాయిలో ఇచ్చే కార్డులను రద్దు చేశారు. ఇది వరకు జిల్లా స్థాయిలో కార్డులు
ఇచ్చేవారని, ఈ కార్డులతో ఎలాంటి ప్రత్యేక హోదా ఉండదని, కేవలం జర్నలిజం కోసం మాత్రమే వాడాలని, విజిటింగ్ కార్డులు, లెటర్ హెడ్స్ పై' అక్రెడిటేటెడ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ' అన్న పదాలు వాడరాదని, ముద్రించరాదని పేర్కొనటం సరికాదని వారన్నారు. ఈ జీవో ద్వారా చిన్న పత్రికలను చిదిమేస్తుందని, మూలిగే నక్క మీద తాటి కాయ అన్న చందంగా చిన్న పత్రికలపై కక్షసాధింపు ధోరణిగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో కఠినమైన నిబంధనలతో అక్రెడిటేషన్ రూల్స్ ఫ్రేం చేశారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి, ఈ జీవోను సవరిచాంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టియుడబ్ల్యూజే H 143 జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి గౌడ్, రాష్ట్ర నాయకులు దారాసింగ్ సిహెచ్ పరశురాం, వేణుగోపాల్ రెడ్డి, నాగరాజు, కరుణాకర్ రెడ్డి, క్రాంతి, నగేష్ గౌడ్, శ్రీకాంత్, అమృతం, ప్రదీప్, రాఘవరెడ్డి, నారాయణ, పవన్ తో పాటు జిల్లాలోని వివిధ మండలాల నుంచి జర్నలిస్టులు తరలివచ్చారు.


