'ప్రభుత్వ ఆయుర్వేద వైద్య సేవలు వినియోగించుకోవాలి' : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ ( ప్రజా స్వరం ) :
కరీంనగర్ జిల్లా రామ్ నగర్ లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో ఉచిత ఆయుర్వేద మెడికల్ క్యాంపు నిర్వహించారు.ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కల్పిస్తున్న ఆయుర్వేద వైద్య సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.రోగులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందజేశారు.ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రదర్శనలో ఉంచిన ఆయుర్వేద ఔషధాలను,పలు రకాల ఆయుర్వేద మొక్కలను పరిశీలించారు.ఇక్కడ యోగా కేంద్రంలో యోగాసనాలను పరిశీలించారు. ఆయుష్మాన్ ఆసుపత్రిని సందర్శించి పలు సూచనలు చేశారు.కలెక్టర్ గారు మాట్లాడుతూ ఆయుర్వేద మందులు ఒక దివ్య అవుషదంగా పనిచేస్తాయని,ప్రతి ఒక్కరు ఆయుర్వేద మందులు వాడాలని ఆసుపత్రి కి వచ్చిన పేషంట్లకు కలెక్టర్ పమేలా సత్పతి గారు తెలియజేశారు.ఒక ఆస్పత్రిలో ఆరోగ్య మహిళ సహా ప్రభుత్వం నుంచి లభించే ఉచిత వైద్య సేవలు, ఔషధాల వివరాలు తెలియజేయాలని ఆదేశించారు.ఆయుష్ డిపార్ట్మెంట్ నుండి అందజేస్తున్న సేవలను వివరంగా రోగులకు తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.గర్భిణీలకు సాధారణ ప్రసవానికి మేలు చేసే యోగాసనాలను గురించి తెలియజేయాలన్నారు.ఆస్పత్రి ఆవరణను శుభ్రం చేసి మొక్కలు నాటాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ,యునాని సీనియర్ మెడికల్ ఆఫీసర్ యసబ్ సుల్తానా,డి.పి.ఎం జి.ప్రవీణ్ కుమార్, ఆర్.నీరజ పాల్గొన్నారు.


