యూరియా దాచిపెడితే చర్యలు తప్పవు
యూరియా దాచిపెడితే చర్యలు తప్పవు
సిద్దిపేట, ( ప్రజాస్వరం) :
పౌల్ట్రీ ఫామ్ లలో ఫర్టిలైజర్ షాపులలో అక్రమంగా యూరియా దాచిపెట్టి రైతులకు మరియు ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురి చేసే విధంగా ప్రయత్నాలు చేస్తే తప్పవని అధికారులు వెల్లడించారు. నమ్మదగిన సమాచారంపై టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమేష్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, అర్బన్ వ్యవసాయ అధికారి శ్రీధర్, కొండపాక మండల వ్యవసాయ అధికారి శివరామకృష్ణ సంయుక్తంగా పొన్నాల గ్రామ శివారులో ఉన్న అశోక్ లేలాండ్ సర్వీసింగ్ సెంటర్, పటేల్ డైరీ ఫార్మ్ కృష్ణ సాగర్, ఫర్టిలైజర్ షాప్ దుద్దెడ, రైస్ మిల్ బందారం, పైప్స్ ఫ్యాక్టరీ అంకిరెడ్డిపల్లి, తదితర అనుమానిత ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా పై అధికారులు మాట్లాడుతూ. యూరియాను దాచిపెట్టి, బ్లాక్ మార్కెట్ చేసిన, అక్రమంగా ఫార్మస్ లల్లో దాచిపెట్టిన, మరియు యూరియా విషయంలోఎవరైనా రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు