దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉంది బీఆర్ఎస్ తీరు : విప్ ఆది శ్రీనివాస్
బీఆర్ఎస్ తీరు దొంగే దొంగ అన్నట్టు ఉంది: విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్ ( ప్రజాస్వరం ) :
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బిఆర్ఎస్ తీరు దొంగే దొంగ అన్నట్టు ఉందని విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. గాంధి భవన్ లో గురువారం మీడియా సమావేశం లో అయన మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు ఫోన్ ట్యాపింగ్ చేసి దొరికిపోయిన దొంగలు ..కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆడిపోసుకునే విధంగా సొంత ప్రత్రికలో రోత రాతలు రాస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ దొంగల పాపం పండింది ..లోక్ సభ ఎన్నికల్లో గుండు సున్నా కు పరిమితమయ్యారన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో సూత్రధారులు, పాత్రధారులు పాత్ర తేలాల్సి ఉంది ఎక్కడ దాకున్న కూడా ఫోన్ ట్యాపింగ్ నిందితులను వదిలే ప్రసక్తే లేదు అని అన్నారు. బీ ఆర్ ఎస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ బురద మాకు అంటించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మహాలక్ష్మి పథకంతో మహిళలకు 200 కోట్ల ప్రయోజనం కలిగింది పదేళ్ల హయంలో పది రేషన్ కార్డులు ఇవ్వలేదు బీ ఆర్ ఎస్ అని అన్నారు. ధనిక రాష్ట్రం కాస్తా 7 లక్షల కోట్లకు అప్పులు కట్టే దుస్థితి దాపురించిందని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ,బీసీ కుల గణన చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధి నిరూపించుకుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ నిందితులను వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన కర్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రశ్నించే గొంతులకు తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు కాళేశ్వరం పై విచారణజరుగుతోంది.సూత్రధారులు , పాత్రధారులను వదిలి పెట్టే ప్రసక్తే లేదు చట్టం తన పని తాను చేసుకొని పోతోంది బీజేపీ - బీ ఆర్ ఎస్ వైఖరి గల్లీలో లొల్లి ఢిల్లీలో దోస్తీ ల ఉందన్నారు.