ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తో
తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తో
తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం
హైదరాబాద్, ( ప్రజాస్వరం ) :
తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన సర్వే ఎంపైరికల్ డేటా ఆధారంగా స్థానిక సంస్థలు,విద్యా , ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ శాసన సభ లో చేసిన చట్టం గవర్నర్ నుండి రాష్ట్రపతి దగ్గర కి పంపిన బిల్లు, అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ కేబినెట్ తీర్మానం అనంతరం గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ రిజర్వేషన్ల పై భవిష్యత్ కార్యాచరణ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్,మంత్రులు పొన్నం ప్రభాకర్,కొండా సురేఖ,వాకిటి శ్రీహరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ,ఎక్స్పర్ట్ కమిటీ మెంబెర్స్ కంచె ఐలయ్య ఇతర ముఖ్య నేతలు ఉన్నారు