రాకపోకలు బంద్
తండా కు రాకపోక లు బంద్...
బ్రిడ్జ్ నిర్మించాలని తండా వాసుల విజ్ఞప్తి...
ప్రతి వర్షాకాలం ఇదే పరిస్థితి....
మెదక్ జూలై 23 (ప్రజా స్వరం)
గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం దూప్ సింగ్ తాండ కు వెళ్లే వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. ధూప్ సింగ్ తండా నుండి వేరే ఊర్లకు తండా కు రాకపోకలు నిలిచిపోయాయి. 2021 గత ప్రభుత్వ హాయంలో 3 కోట్ల వ్యయం తో బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభం చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను గుత్తేదారులు మధ్యలోనే వదిలి వేయడం జరిగింది. అధికారులు గుత్తేదారులకు నోటీసులు అందించినప్పటికి స్పందన లేకుండా పోయింది. బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని పలుమార్లు తండా వాసులు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు విన్నవించినప్పటికీ ఎవరు కూడా ఇప్పటి వరకు స్పందించడం లేదని స్థానిక తండా వాసులు పేర్కొంటున్నారు. ఈ తండా పరిస్థితి ప్రతి వాన కాలం ఇదే తరహాలో రాకపోకలు నిలిచిపోతున్నాయని అక్కడి వారు తెలిపారు. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.