మణిపుర్ పేరులోనే మణి ఉంది.. అది దేశానికే మణి వంటిది :  భారత ప్రధాని నరేంద్ర మోడీ

మణిపుర్ పేరులోనే మణి ఉంది.. అది దేశానికే మణి వంటిది :  భారత ప్రధాని నరేంద్ర మోడీ

మణిపుర్ పేరులోనే మణి ఉంది.. అది దేశానికే మణి వంటిది
               భారత ప్రధాని నరేంద్ర మోడీ
రోడ్డు మార్గంలో మణిపుర్ కు ..ఇంపాల్, చురాచంద్ పుర్ లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

మణిపుర్ / ఢిల్లీ  సెప్టెంబర్ 13  (ప్రజాస్వరం) : 

Read More నాచారం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మైనంపల్లి హన్మంతరావు 

మణిపుర్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించారు.  ఇంపాల్, చురాచంద్ పుర్ లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.  మణిపుర్ లో అల్లర్ల బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మణిపుర్ బహిరంగ సభలో మాట్లాడారు. భారీ వర్షాల వల్ల హెలికాప్టర్ లో రావడం సాధ్యపడలేదని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రోడ్డు మార్గంలో మణిపుర్ కు వచ్చానని అన్నారు. .మణిపుర్ లో అల్లర్ల బాధిత కుటుంబాల చిన్నారులతో ముచ్చటించారు. . రోడ్డు మార్గంలో వచ్చేటప్పుడు తనకు మణిపూర్ వాసులు పలికిన స్వాగతం మర్చిపోలేనని, మువ్వెన్నల జెండాలు చేతబట్టి తనకు ఘనంగా స్వాగతం పలికారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మణిపుర్ పేరులోనే మణి ఉందని అది దేశానికే మణి వంటిదని, మణిపుర్ దేశానికి ప్రకృతి ఇచ్చిన బహుమతి అని కొనియాడారు.మణిపుర్ ను వేగంగా ప్రగతి పథంలో పయనింపజేస్తాం అని మణిపుర్ కోసం రూ.7 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. మణిపుర్ ను దేశంతో అనుసంధానం చేసే ప్రాజెక్టులు చేపడుతున్నామని, రైలు, రోడ్డు మార్గాల కోసం మణిపుర్ కు నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. రూ. 8 వేల కోట్లతో జాతీయ రహదారుల పనులు వేగంగా కొనసాగుతున్నాయని, మణిపుర్ లో రైల్ కనెక్టివిటీ భారీగా పెంచుతున్నామని మోడి పేర్కొన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతుందని చెప్పారు. ప్రస్తుతం మణిపుర్ చేపడుతున్న ప్రాజెక్టులతో మౌలిక సదుపాయాలు, వైద్యసేవలు మెరుగవుతాయని, ఈశాన్య రాష్ట్రాల్లో దశాబ్దాలుగా అనేక వివాదాలు, ఉద్యమాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొంటోందని, శాంతి స్థాపన ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడించారు. శాంతి స్థాపన ద్వారా తమ భావితరాల భవిష్యత్తు బావుంటుదని,  మణిపుర్ ప్రజల వెంట భారత ప్రభుత్వం ఉందని మోడి స్పష్టం చేశారు.

Read More స్థానిక సంస్థల ఎన్నికల కేసు నవంబర్ 24కు విచారణ వాయిదా

Latest News

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్  రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్
ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 
విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
 చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం    :   బిజెపి శాసనసభ నేత  ఏలేటి మహేశ్వర్ రెడ్డి