లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కిన ఎస్సై 

లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కిన  ఎస్సై 

మెడ్చల్ / శామీర్ పేట ఏప్రిల్ 28 (ప్రజాస్వరం ) : 

లంచం తీసుకుంటూ ఓ ఎస్సై ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ పట్టుబడిన సంఘటన  మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో  చోటుచేసుకుంది.  ఓ  కేసులో ఇద్దరినీ  తప్పించేందుకు  శామీర్ పేట్ ఎస్సై పరశురామ్  లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఫిర్యాదు దారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అప్పటికే 2 లక్షల రూపాయలు లంచం ఇవ్వగ, సోమవారం మరో 22 వేల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు  ఎస్సై ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేసు నమోదు చేసి ప్రత్యేక న్యాయ మూర్తి ముందు హాజరు పర్చారు. అధికారులు ఎవరైనా లంచం అడిగితే తమను ఆశ్రయించాలని ఏసీబీ అధికారులు కోరారు. 

Read More కేసీఆర్ ప్రసంగంలో పస లేదు