తూప్రాన్ లో హనుమాన్ మండల దీక్ష మాలధారణ....
తూప్రాన్, ఫిబ్రవరి 19 (ప్రజాస్వరం ) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ పట్టణం లో పెద్ద చెరువు కట్ట పై వెలిసిన శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం లో గురువారం రోజు హనుమాన్ మండల దీక్ష వేసుకునే భక్తులకు ఆలయ పూజారి గురు స్వామి సలక ఆత్రేయ శర్మ మాలధారణ వేశారు.తెలంగాణ రాష్ట్రంలోని రెండవ కొండగట్టుగా పేరుగాంచిన తూప్రాన్ పెద్ద చెరువు కట్ట శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో గురుస్వామి సలక ఆత్రేయ శర్మ సమక్షంలో 41 రోజు మండల హనుమాన్ మాల దీక్ష ప్రారంభం అయ్యాయి
పట్టణంలోని పెద్దచెరువు కట్టపై వెలసిన వీరాం జనేయస్వామి భక్తులు కోరిన కోర్కెలను తీర్చే స్వామిగా విరాజిల్లుతున్నారు . స్వప్నంలో సాక్షాత్కారమై చెరువు కట్టపై స్వయం భూ గా వెలసినట్లు భక్తుల ప్రగాఢ నమ్మకం నాటి నుంచి పట్టణ వాసులు ఆలయ అభివృద్ధిపై చర్యలు తీసు కున్నారు. దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల పూజలనందుకుంటూ
ఆత్రేయ శర్మ ఆధ్వర్యంలో ఆలయ పరిసరాల్లో శివపంచాయతన, నవగ్రహ, శనేశ్వర, సత్య నారాయణస్వామి, గణపతి దాతత్రేయ సాయి బాబా విగ్రహా ప్రతి ష్ఠాపన జరిగింది. . ఆలయ పూజారి గురు స్వామి ఆత్రేయ శర్మ ఆధ్వర్యంలో హన్ మాన్ మాలధారణ వేసుకునేందుకు భక్తులు ఈ ఆలయానికి అధిక సంఖ్యలో విచ్చేస్తారు.
గురు స్వామి ఆత్రేయ శర్మ సమక్షంలో 41 రోజు మండల దీక్ష హనుమాన్ మాలాధారణ దీక్ష తీసుకున్న హనుమాన్ భక్తులు 21 రోజులు అర్ద మండలం మాలధారణ వేసుకునే భక్తులు ముందుగా పేర్లు ను ఆలయం లో తెలియజేయాలి అని ఆత్రేయ శర్మ తెలిపారు
ప్రతి శనివారం, మంగళవారం ప్రత్యేక పూజలు ఆలయ ప్రత్యేకత హనుమాన్ మాలధారణ వేసుకున్న ఆలయం లోనే ఇరుముడి కట్టి శోభయత్ర తో మల విరమణ కూడ ఇక్కడే జరుగుతుంది అని ఆయన అన్నారు కొనసాగుతాయి. ఏటా హను మాన్ జయంతికి మూడు రోజులు పాటు ఉత్సవాలను నిర్వహిస్తారు.


