ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం...
సర్పంచ్ పత్తి నర్సింలు ....
దామరకుంట లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ
గజ్వేల్, ఫిబ్రవరి 19 (ప్రజాస్వరం):
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని సర్పంచ్ పత్తి నర్సింలు అన్నారు గురువారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం దామరకుంట గ్రామంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు వచ్చిన కొంతం యాదమ్మ ఇల్లు నిర్మాణానికి ముగ్గుపోసే కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ పత్తి నర్సింలు మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన కొనసాగుతుందని, ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు దశలవారీగా నెరవేర్చుతూ ప్రజారంజక పరిపాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి,గ్రామ ఉప సర్పంచ్ దేవి విజయ రమేష్, రాజబోయిన రమేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్, ప్రభు, సంజీవ్, బాలరాజు ఆనంద్ శ్రీకాంత్ బాలచంద్రం అఖిల్ లింగం యాదగిరి రవి గౌడ్ శంకర్ యాదవ్, బాల నరసింహులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు


