సరస్వతీ శిశుమందిర్ లో ఘనంగా ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు...
ఆదిలాబాద్ జిల్లా, ఫిబ్రవరి 19 (ప్రజాస్వరం):
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రము లోని స్థానిక శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల లో హిందూ సామ్రాజ్య స్థాపకుడు, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి ని పురస్కరించుకొని పాఠశాల లో జయంతి వేడుకలు నిర్వహించారు.ఆచార్యులు విద్యార్థులు శివాజీ మహరాజ్ ప్రతిమకు పూల మాల వేసి నివాళులు అర్పించారు. ప్రధానాచార్యులు మరాఠీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహరాజ్ యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు వివరిస్తూ హిందూ సామ్రాజ్య స్థాపన కోసం తన ప్రాణాలను అర్పించి ఎంతో మందికి స్ఫూర్తి దాయకం గా నిలిచి యుద్ధం లో శత్రువులను చీల్చి చెండాడి మట్టి కరిపించిన తీరును వివరించారు. ఛత్రపతి శివాజీ యొక్క గొప్పతనాన్ని,ధైర్య సాహసాలను, హిందుత్వ నిష్టను మనమంతా ఆదర్శంగా తీసుకొని భారతీయ విలువలను పెంపొందించు కోవాలనీ అన్నారు.ఆచార్యులు ఉషారాణి, భారతి,సుజాత,మంజుల,శంకర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


