డిసిసి పై మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు...
బీఆర్ఎస్ అభ్యర్థిని మల్లారెడ్డి బక్రను చేశాడు అనడంతో అభ్యంతరం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు
మేడ్చల్, ఫిబ్రవరి 5(ప్రజాస్వరం):
ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని రాజబొల్లారం 6వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేశం రాణి నారాయణ గౌడ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భర్తను కురకుల రమేష్ ను బకరాను చేయడానికి ఎన్నికల బరిలో దింపారని అన్నారు.దీంతో ప్రచారం నిర్వహిస్తున్న పక్కనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి భర్త కురకుల రమేష్,మండల ప్రధాన కార్యదర్శి సుదర్శన్,మాజీ సర్పంచ్ మండల లక్ష్మీనారాయణ నాయకులు రాజు,పవన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.దీంతో ఇరువురు నాయకుల మధ్య మాటలు యుద్ధం కొనసాగింది.డీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు.మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రాజాబొల్లారం గ్రామంలో తిరగనీయబోమని వజ్రేష్ యాదవ్ ను హెచ్చరికలు జారీ చేశారు.కౌన్సిలర్ అభ్యర్థి భర్త దేశం నారాయణ గౌడ్ ఏముఖం పెట్టుకొని రాజబొల్లారం గ్రామంలో తిరుగుతున్నాడని ప్రశ్నించారు.


