మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ — ముఖ్య కార్యకర్తల సమావేశం

మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ — ముఖ్య కార్యకర్తల సమావేశం

పటాన్‌చెరు, జనవరి 23(ప్రజాస్వరం):

రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడిదల, గడ్డ పోతారం మున్సిపాలిటీల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించబడింది.

ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు మరియు భూగర్భ శాస్త్ర శాఖ మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి మరియు టిజిఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఇస్నాపూర్, ఇంద్రేశం మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించే లక్ష్యంతో నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను బలంగా ముందుకు తీసుకెళ్లడమే పార్టీ ధ్యేయమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ ఇంచార్జి నీలం మధు, గాలి అనిల్ కుమార్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Latest News

బీఆర్ఎస్ ప్రచారంలో హోరు ప్రజల బ్రహ్మరథం ....  బీఆర్ఎస్ ప్రచారంలో హోరు ప్రజల బ్రహ్మరథం .... 
తూప్రాన్, ఫిబ్రవరి 5 (ప్రజాస్వరం) : తూప్రాన్ మున్సిపాలిటి 14వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి పోతరాజు రచన ధనరాజ్ ఇంటింటి ప్రచారం.... బ్రహ్మరథం పట్టిన వార్డు ఓటర్లు......
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసింది..
తూప్రాన్ 16వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటా ప్రచారం భారీ ర్యాలీ...  
న్యాయవాది స్వప్నను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి...
డిసిసి పై మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు...
తూప్రాన్ గీతా విద్యా సంస్థలకు అంతర్జాతీయ అవార్డు ...
సామాన్య భక్తులే విఐపిలు మహాశివరాత్రి జాతరను విజయవంతం చేయాలి ...