సేవ చేసే అభ్యర్థులనే ఎన్నుకోవాలి....
ఎంపీ ఈటెల
మేడ్చల్, (ప్రజాస్వరం): డబ్బులు, ప్రలోబాలు, మద్యం ఉన్నపటికీ కూడా మానవాడేవడో పనిచేసే వాడెవడో గుర్తించి ప్రజలు కౌన్సిలర్ అభ్యర్థులుగా గెలిపించుకోవాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం బిజెపి పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల తరఫున నామినేషన్ దాఖలు చేసేందుకు భరత్ బైబిల్ కాలేజీలోని నామినేషన్ కేంద్రానికి అభ్యర్థుల తరఫున మద్దతుగా వచ్చారు. 10వ వార్డు గౌరయ్య గారి సుప్రియ శ్రీనివాస్ గౌడ్, 16 దొంగల జగదీశ్వర్ రెడ్డి, 17 ప్రవీణ్ ముదిరాజ్, 21 ఉషిగారి గిరిబాబు లు mp ఈటల రాజేందర్ తో కలిసి రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జగన్ గౌడ్,గుండ్ల పోచంపల్లి కౌన్సిలర్ మల్లికార్జున్,శ్రీ రంగవరం గ్రామ బీజేపీ పార్టీ అధ్యక్షుడు భూపాల్ ,బిజెపి నాయకులు వెంకట్ ముదిరాజ్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.


