చిత్తారమ్మ ఆలయ అభివృద్ధికి కృషి...

మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి...

చిత్తారమ్మ ఆలయ అభివృద్ధికి కృషి...

రామాయంపేట, జనవరి 25 ( ప్రజాస్వరం):

మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని చిత్తారమ్మ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం చిత్తరమ్మ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. చిత్తరమ్మ వార్షిక బ్రహ్మోత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కంటారెడ్డి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మాజీ పిఏ సిఎస్ చైర్మన్ బాదే చంద్రం, పుట్టి యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

Latest News

వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్... వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్...
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం):   స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే...
13వ వార్డులో జానకిరామ్ గౌడ్ ఇంటింటా ప్రచారం.... 
తూప్రాన్ లో పోలీస్ ల ప్లాగ్ మార్చ్..... 
అక్రమ మద్యం రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్...
షాపుల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి....
104 లీటర్ల మద్యం స్వాధీనం, స్విఫ్ట్ కారు సీజ్...
14వ వార్డులో జనసేన అభ్యర్థి జంగం స్వాతి సుధాకర్ హోరాహోరీ ప్రచారం...