వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్...
By Prajaswaram
On
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం):
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే హుస్సేన్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ పరిశోధన రంగంలో కళాశాల అధ్యాపకులు ఈ విధంగా కృషి చేస్తున్నందుకు ప్రశంసించారు. పరిశోధనలు వ్యక్తిగతంగా కెరీర్ పరంగా అధ్యాపకులకు చాలా అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పైడి హరిత మాట్లాడుతూ రాజస్థాన్ లోని జగదీష్ ప్రసాద్ జబర్మల్ టిబ్రేవాలా విశ్వవిద్యాలయంలో డాక్టర్ ముఖేష్ కుమార్ పర్యవేక్షణలో ఏ స్టడీ ఆన్ కస్టమర్ సర్వీసెస్ అండ్ ట్రైనింగ్ విత్ సబ్జెక్టెడ్ టూ పాలసీ ఇంటరక్షన్స్ ఇన్ ఇండియన్ ఇ -కామర్స్ పోర్టల్స్ అనే అంశం పై పరిశోధన చేసినందుకు గాను డాక్టరేట్ పొందినట్లు తెలిపారు.
Latest News
06 Feb 2026 20:57:57
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే...


