క్రీడలు మానసిక శారీరక దృఢత్వానికి దొహదం...
ఎంపీడీఓ ప్రీతి రెడ్డి
నార్సింగి, జనవరి 29 ( ప్రజాస్వరం):
నార్సింగ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మూడు రోజులపాటు నిర్వహించే సీఎం కప్ 2025-26 సంబంధించిన క్రీడా పోటీలను ఎంపీడీవో ప్రీతి రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు, క్రీడా పోటీలకు హాజరైన అతిథులను విద్యార్థులు మార్చ్ ఫస్ట్ నిర్వహిస్తూ ఘన స్వాగతం పలికారు, వాలీబాల్ క్రీడలు టాస్ వేసి ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకొని వారికి ఆల్ ది బెస్ట్ తెలిపారు, విద్యార్థులు వేసిన సీఎం కప్పు ముగ్గు వద్ద తహసిల్దార్ గ్రేస్ బాయ్ స్థానిక సర్పంచ్ సుజాత మల్లేశం గౌడ్ మండల విద్యాధికారి గంగాబాయ్ ఉపసర్పంచ్ రాజేందర్ రెడ్డిలు బెలూన్ లు ఎగరవేసి క్రీడలను ప్రారంభించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీర దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడతాయని క్రీడాకారులు స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడానికి క్రీడలు అవసరమని ఎలాంటి గొడవలకు తావివ్వకుండా క్రీడా పోటీలలో పాల్గొనాలని వారు తెలిపారు మండల స్థాయి గెలిచిన క్రీడాకారులను డివిజన్ స్థాయిలో డివిజన్ స్థాయిలో గెలుపొందిన విద్యార్థులను జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుందని వారన్నారు, జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రథమ కనపరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహించి రాబోయే ఒలంపిక్ క్రీడలను విద్యార్థులను పంపించడం జరుగుతుందని వారు సూచించారు, ప్రతి విద్యార్థికి చదువుతోపాటు క్రీడలు కూడా చాలా అవసరమని క్రీడల వల్ల మానసిక ఒత్తిడి తగ్గి చదువులో బాగా రాణించడం జరుగుతుందని క్రమశిక్షణ కలిగిన క్రీడాకారులుగా విద్యార్థులు ముందుకు సాగుతారని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ నరేందర్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవిచంద్రన్, తదితరులు పాల్గొన్నారు


