ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి గాయాలు....

ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి గాయాలు....

రామాయంపేట, జనవరి. 26( ప్రజాస్వరం ):

మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామానికి చెందిన కీర్తి సిద్దయ్య అనే వ్యక్తి మేకలు కాయడానికి అడవికి వెళ్లగా పొదల చాటునుండి వచ్చి ఎలుగుబంటి దాడి చేసింది. తీవ్ర గాయాలైన సిద్దయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఫారెస్ట్ అధికారులు పరామర్శించారు. ప్రభుత్వం తరఫున బాధితులను ఆదుకుంటామని తెలిపారు. బాధితుడికి సరైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు