అంబేద్కర్ లేకుంటే మనం లేము....
SC, ST కమీషన్ చైర్మైన్ బక్కి వెంకటయ్య..
తూప్రాన్, ఫిబ్రవరి 25( ప్రజాస్వరం ) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కేటిఆర్ కాలనీ వాసులకు రోడ్ సౌఖర్యం లేని సందర్బంగా కాలనీవాసులు పోరాట పటిమతో పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో నుండి రహదారి ఏర్ఫాటు చేసుకోవడం జరిగింది... దీనిపై పోలీసులు కేసులు పెట్టారు, రెవిన్యూ అధికారుల ఒత్తిడి తీసుకురావడంతో భాదితులూ SC, St కమీషన్ ను ఆశ్రయించడం జరిగింది, విషయం తెలుసుకున్న చైర్మన్ బక్కి వెంకటయ్య సంబందిత అధికారులతో పలుమార్లు మాట్లాడటం, రెవిన్యూ అధికారులను సర్వేకు ఆదేశించడం, పోలీసులకు తప్పుడు కేసులు తీసేయాలని ఆదేశించడం జరిగింది, అనంతరం సర్వే తర్వాత అది ప్రభుత్వ భూమే అని తెలింది, కాలనీవాసులు ఏర్పాటు చేసుకున్న రోడ్ వల్ల మా రెవిన్యూ కు ఎటువంటి ఇబ్బంది లేదని అఫిషియల్ గా రిఫోర్ట్ ఇవ్వడమైనది,దీనికి కొండ్ర ఎల్లయ్య నేతృత్వం వహించగా ప్రధాన బలంగా మాలమహానాడు తోడున్నాం, సుధీర్ఘ పోరాటం అనంతరం రోడ్ ను సాదించాం...దీనితో ఈ పోరాట విజయాన్ని చైర్మన్ వెంకటయ్య చేతులమీదుగా నేడు ఆ రోడ్ ను ప్రారంభించి ఘనంగా సభ నిర్వహించడం, గౌరవించుకోవడం జరిగింది. ఇది SC, ST, BC లు కలిసి నివసిస్తున్న 200 కుటుంబాల పోరుగాథ....


