పేదింటి ఆడబిడ్డలకు వరం కళ్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ పథకాలు
గూడెం మహిపాల్ రెడ్డి
194 మందికి ₹1.94 కోటి విలువైన చెక్కుల పంపిణీ
పటాన్ చెరు,జనవరి 09 (ప్రజాస్వరం):
పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వరంగా మారాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
శుక్రవారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అమీన్పూర్, రామచంద్రపురం, గుమ్మడిదల, జిన్నారం, పటాన్చెరు రెవెన్యూ మండలాలకు చెందిన 194 మంది లబ్ధిదారులకు పథకాల ద్వారా మంజూరైన మొత్తం ₹1 కోటి 94 లక్షల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే, అర్హులైన ప్రతి ఒక్కరికి దళారుల ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పటాన్చెరు నియోజకవర్గంలో సుపరిపాలన లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. కళ్యాణ లక్ష్మి పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రులకు కొండంత ఆసరాగా నిలుస్తోందని అన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, సీనియర్ నాయకులు రాజు, వెంకటేష్, ఇమ్రాన్, ఆయా మండలాల తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.


