అంటరానితనాన్ని రూపుమాపాలి....
పౌర హక్కుల దినోత్సవం లో తహశీల్దార్ మాలతి ...
By Prajaswaram
On
చిన్న శంకరంపేట, ఫిబ్రవరి 28 ( ప్రజస్వరం ) :
చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామంలో స్థానిక సర్పంచ్ నాగరాజు ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి హాజరైన తహశీల్దార్ మాలతి ఎస్సై నారాయణ గౌడ్లు మాట్లాడుతూ కులమత బేధాలు లేకుండా ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని చిన్నపాటి సమస్యలను పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా గ్రామస్థాయిలో పరిష్కరించుకోవాలని వారు సూచించారు సమాజం నుంచి అంటరానితనాన్ని పూర్తిగా తొలగించాలని వారు పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో తహసిల్దార్ మాలతి స్థానిక సర్పంచ్ నాగరాజు ఎస్సై నారాయణ గౌడ్, ఉప సర్పంచ్ మల్లేష్, పంచాయతీ కార్యదర్శి నాంపల్లి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, అంగన్వాడి టీచర్లు స్వప్న, అనిత, గ్రామ ప్రత్యేక అధికారి తులసీరామ్, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు,
Latest News
28 Feb 2026 21:41:36
రాజకీయ కక్ష సాధింపు లో భాగంగా అక్రమ కేసులు నమోదు...మాజీ మున్సిపల్ మల్లిఖార్జున్ గౌడ్ అరెస్ట్ అప్రజాస్వామికం..... మెదక్, ఫిబ్రవరి 28 (ప్రజాస్వరం): కాంగ్రెస్ పార్టీ కక్ష...


