ఉపాధి హామీలో నాటిన చెట్లను నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి...
మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్ డిమాండ్....
చిన్న శంకరంపేట, ఫిబ్రవరి 28 ( ప్రజాస్వరం):
చిన్న శంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో ఉపాధి హామీ పథకంలో నాటిన చెట్లను కోసివేయడం జరిగింది. ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలను పెంచి రోడ్డుకు ఇరువైపులా గతంలో నాటడం జరిగిందని ప్రభుత్వం చెట్లను పెంచడానికి అనేక నిధులను వెచ్చించి చెట్లను పెంచితే ఈరోజు చెట్లను గ్రామపంచాయతీ వారు ఎవరికి తెలియకుండా నరికి వేయడం సరైన పద్ధతి కాదని చిన్న శంకరంపేట మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు . చెట్లను పెంచడం ద్వారా గ్రామంలో స్వచ్ఛమైన వాతావరణo ఉంటుందని సురక్షితమైన ఆక్సిజన్ లభిస్తుందని అలాంటి చెట్లను ఈరోజు నరికి వేయడం సరైనది కాదని దీనిపై అధికారులు స్పందించి దీనికి కారణమైన వారిపై మరియు పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ విషయం పట్ల పై అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు.


