వెంకటేశ్వర స్వామి పునః ప్రతిష్ట ....
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (ప్రజాస్వరం):
నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం ఎల్లమ్మ రంగాపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పునః ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాలని శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ర్ నాయుడుకి వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన కొమ్ముగోని శ్రీనివాస్ గౌడ్, ఎల్లమ్మ రంగాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ గౌరవ అధ్యక్షులు సంజీవరెడ్డి, దేవాలయ చైర్మన్ రాజిరెడ్డి లు ఆహ్వాన పత్రికను అందించారు. హైదరాబాదు నగరంలోని బి.ఆర్ నాయుడు కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికలను అందించారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు, నాట్కో ఫార్మా చైర్మన్ సదాశివరావుకు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ రంగాపూర్ శ్రీ వెంకటేశ్వర దేవాలయానికి సుమారు తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డును ఈ సందర్భంగా చైర్మన్ నాయుడు అందించారు. స్వామివారికి ప్రవచనాలకు సంబంధించి రూపొందించిన 2000 విష్ణు శాస్త్ర నామాల బుక్స పుస్తకాలను దేవాదాయ కమిటీకి అందించారు.


