సబ్సిడీ వ్యవసాయ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలి'..

వ్యవసాయ శాఖ ఏడీ పుణ్యవతి..

సబ్సిడీ వ్యవసాయ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలి'..

 

మాసాయిపేట, ఫిబ్రవరి 27 (ప్రజాస్వరం) :

 

రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ వ్యవసాయ పరికరాలను రైతులు వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీ పుణ్యవతి సూచించారు. మాసాయిపేట మండలానికి మంజూరైన మూడు స్ప్రేయర్లు, మూడు రోటవేటర్లను మండల వ్యవసాయ అధికారి కవితతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు.

 

వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకే ప్రభుత్వం ఈ రాయితీలు ఇస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సంతోష్ రెడ్డి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.