షాద్ నగర్ ఎమ్మెల్యే శంకరయ్య పై కఠిన చర్యలు తీసుకోవాలి..
మండల అధ్యక్షులు మైలారం బాబు ....
By Prajaswaram
On
నార్సింగి,సెప్టెంబర్ 9 (ప్రజాస్వరం) :
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై షాద్నగర్ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ, వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మైలారం బాబు ఆధ్వర్యంలో పార్టీ నేతలు స్థానిక ఎస్ఐ బీమరి సృజన కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు మైలారం బాబు, మాజీ వైస్ ఎంపీపీ ఆకుల మల్లేశ్గౌడ్, వల్లూరు మాజీ సర్పంచ్ అంబరీష్ తీవ్రంగా ఖండించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ బాపు కేసీఆర్ మరణాన్ని కోరుకుంటున్నామంటూ శాద్నగర్ ఎమ్మెల్యే కే శంకరయ్య మాట్లాడటం దురదృష్టకరమని, ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ విలువలను దిగజార్చేలా ఉన్నాయని వారు అన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని ఖబడ్దార్ అని హెచ్చరించారు. రాజకీయ విభేదాలు ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో విమర్శించుకోవాలి తప్ప వ్యక్తిగతంగా కించపరిచేలా, ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అసలు సిసలు దళిత పక్షపాతి కేసీఆర్ అని, నగరం నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన, దళిత సంక్షేమం కోసం పాటు పడిన నాయకుని దళిత వ్యతిరేకి అనేలా ముద్ర వేయాలనుకోవడం హేయమని, దళిత సోదరులు విషయాన్ని గణించి వేర్పాటు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వం, పోలీసులు స్పందించి సంబంధిత ఎమ్మెల్యే పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్కు తగిన భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు విష్ణు వర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భూపతి రాజు, మాజీ సర్పంచ్ చెప్యాల మల్లేశం పార్టీ నాయకులు బాషా నాయక్, సత్యం, యాదగిరి యాదవ్, గొండ స్వామి యాదవ్, ఓం ప్రకాష్ యాదవ్, ఇండ్ల శ్రీనివాస్, సత్తయ్య, మైనార్టీ నాయకులు ఫరిద్, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.
Latest News
09 Sep 2026 14:47:33
నార్సింగి,సెప్టెంబర్ 9 (ప్రజాస్వరం) : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై షాద్నగర్ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ, వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్...


