ప్రభుత్వ భూములు విక్రయిస్తే కఠిన చర్యలు...
కాప్రా ఎమ్మార్వో మతిన్ ....
By Prajaswaram
On
ప్రజాస్వరం, జవహర్ నగర్, జులై 1 :
ప్రభుత్వ భూములు విక్రయించి అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని కాప్రా ఎమ్మార్వో మతిన్ హెచ్చరించారు. బుధవారం జవహర్ నగర్ లో వాళ్ళు అక్రమ నిర్మాణాలను ఎమ్మార్వో ఆదేశాల మేరకు ఆర్ఐ సత్యనారాయణ వికలాంగుల కాలనీలో 1రూమ్, చెన్నాపూర్ ప్రధాన చౌరస్తాలో షెట్టర్ అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను జేసీబీ సాయంతో కూల్చి వేశారు. ప్రభుత్వ భూములు విక్రయించి ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై క్రిమినల్ చర్యలు తప్పవని, జవహర్ నగర్ లో ఎలాంటి కట్టడాలు చేపట్టరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Related Posts
Latest News
03 Jul 2026 07:07:12
ప్రజాస్వరం , తూప్రాన్ : మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ లోని 16వ వార్డు లో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం లో పాల్గొన్న తూప్రాన్ మున్సిపల్ 16...


