యూరియ అందుబాటులో ఉంచాలి ....
బీఆర్ఎస్ ....
By Prajaswaram
On
ప్రజాస్వరం, మనోహరాబాద్ :
రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉంచాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సీ ఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన వారు మాట్లాడుతూ కేసీఆర్ అధికారం లో సీఎం గా ఉండి రైతులకు చేసిన మేలు ఎవరు చేయరని రైతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవసరమైన యూరియా అందుబాటులో ఉంచాలని యాప్ ద్వారా యూరియా పంపిణీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ర్యాకల శేఖర్ గౌడ్, మండల పార్టీ మాజీ అధ్యక్షులు పురం మహేష్ ముదిరాజ్, పర్కిబండ సర్పంచ్ మోతీబాయ్ లక్ష్మణ్ సింగ్, ఉప సర్పంచుల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షులు పంచమి రేణు కుమార్ , దండుపల్లి మాజీ ఉప సర్పంచ్ మహేందర్ గౌడ్, ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ భిక్షపతి, కాళ్లకల్ మైనార్టీ సెల్ నాయకులు ఇర్ఫాన్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
Latest News
01 Jul 2026 19:28:34
ప్రజాస్వరం, జవహర్ నగర్, జూలై 1 : జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధుడు దారుణ హత్యకు గురైన సంఘటన చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల...


