మెదక్ జిల్లా నాగులపల్లి శివారు స్టేషన్ మాసాయిపేట వద్ద.........
By Prajaswaram
On
ప్రజాస్వరం, తూప్రాన్ :
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగులపల్లి శివారు స్టేషన్ మాసాయిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు గాయపడినట్లు గ్రామస్థులు తెలిపారు. తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన కురుమ రాజు (26) మంగళవారం రాత్రి తూప్రాన్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. హైవే బ్రిడ్జి సర్వీస్ రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన రాజును తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి కారణమైన పూర్తి విషయాలు తెలువాల్సి ఉంది.
Latest News
30 Jun 2026 21:49:40
ప్రజాస్వరం, తూప్రాన్ : మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగులపల్లి శివారు స్టేషన్ మాసాయిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు గాయపడినట్లు గ్రామస్థులు తెలిపారు. తూప్రాన్...


