పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించండి

జవహర్ నగర్ మాజీ డిప్యూటీ మీద రెడ్డి శెట్టి శ్రీనివాస్ ...

పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించండి

అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 10,000 నగదు పురస్కారం 

 

జవహర్ నగర్, ఫిబ్రవరి 25, (ప్రజాస్వరం):

రానున్న పదవ తరగతి పరీక్షలు దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉత్తమ ఫలితాలను సాధించాలని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం బాలాజీ నగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను అందజేశారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఫలితాలు సాధించాలన్నారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు పదివేల నగదు పురస్కారాన్ని అందజేస్తానన్నారు. పరీక్షలకు భయపడకుండా ఉపాధ్యాయులు సూచించిన ప్రతి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షలకు హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో రెడ్డి శెట్టి మహేష్ ,ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, కోట శ్రీనాథ్ గుప్తా, గడ్డమీది విజయ్, ప్రధానోపాధ్యాయుడు మమ్మద్ ఖాజా మోయినుద్దన్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Latest News

పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణమే ఉపసంహారించాలి... పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణమే ఉపసంహారించాలి...
మెదక్, మార్చ్ 08 (ప్రజాస్వరం):   గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతూ 60 వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై వేయడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి...
ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటున్న సర్పంచ్....
బోర్లు వేశారు కానీ....
న్యాయవాది పై చేయి చేసుకోవడం హేయం....
మహిళ భవన నిర్మాణానికి స్థానిక సర్పంచ్ సంతోష్ గోండ స్వామి యాదవ్ భూమి పూజ ....
తూప్రాన్ మున్సిపల్ పరిధిలో గాంధీ విగ్రహం ధ్వంసం..... 
పాఠశాలలో ప్లేట్స్ పంపిణీ....