రోడ్డు పనులు చేపట్టేన.... సర్పంచ్ యాదమ్మ
తూప్రాన్ జనవరి 10 (ప్రజాస్వరం):
పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మండలం మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ దోమలపల్లి యాదమ్మ గత సంవత్సరం భారీ వర్షాలు కురిండంతో ఆబోతోపల్లి సమీపంలో హర్టీ వాగు పై ఉన్న బ్రిడ్జ్ కొట్టుకుపోయింది . నాటి నుండి నేటి వరకు గౌడి గూడెం, గుండ్రెడ్డిపల్లి గ్రామస్తుల, వ్యవసాయదారుల రాకపోకలకు నిలిచిపోయాయి . ఈ పరిస్థితి దృష్ట్యా గుండ్రెడ్డిపల్లి కాంగ్రెస్ సర్పంచ్ దోమలపల్లి యాదమ్మ కృష్ణలకు వినతి మేరకు తాత్కాలిక నిధులు మంజూరు చేయడం జరిగింది. దీంతో తక్షణమే కాంగ్రెస్ నాయకులు దోమలపల్లి కృష్ట జెసిబి సహాయంతో మరమ్మత్తు పనులును చేపట్టారు మళ్లీ వర్షాలు కురిస్తే కొట్టుకుపోయే అవకాశం ఉంది కావున వెంటనే ప్రభుత్వం నిధులు మంజూరు చేసి శాశ్వత పరిష్కారం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు గౌడుగూడెం మల్కాపూర్ గుండ్రెడ్డిపల్లి కోనాయిపల్లి వెళ్తుందని వెంటనే బ్రిడ్జ్ నిర్మాణం చేసి శాశ్వత పరిష్కారం చేయాలని ఈ కార్యక్రమంలో తూప్రాన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి కొత్తపల్లి నర్సింగ్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు


