సికింద్లపూర్ ఆలయానికి విద్యాసాగర్ 5 వేలు అందజేత
By Prajaswaram
On
మనోహరాబాద్ / శివంపేట ( ప్రజాస్వరం ) :
మెదక్ జిల్లా శివంపేట మండలం లోని సికింద్లపూర్ శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన సోషల్ వర్కర్ నేతి కుంట భవాని విద్యాసాగర్ రూ. 5 వేలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రతి నూతన సంవత్సరం రోజున ఆలయానికి 5000 రూపాయలు అందజేయడం జరుగుతుందని అందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని సూచించారు. లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకుంటే ఎన్నో పుణ్యాలు లభిస్తున్నట్లు నమ్ముతున్నానని తెలిపారు. రానున్న కాలంలో ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అందుకు స్వామివారు తనకు అవకాశం కల్పించాలని భగవంతున్ని కోరుతున్నట్లు విద్యాసాగర్ తెలిపారు.
Read More రోడ్డుపై బైఠాయించిన రైతులు..
Latest News
02 Jan 2026 21:55:31
తూప్రాన్ జనవరి 2 పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి (ప్రజాస్వరం) ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడి శివంపేట పోలీస్


