బాలాజీ నగర్ లో టైగర్ కారింగుల నర్సింగరావు గౌడ్ 27వ వర్ధంతి ...
నివాళులర్పించిన కుల, రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు
జవహర్ నగర్, ఫిబ్రవరి 3,(ప్రజాస్వరం):
జవహర్ నగర్ వ్యవస్థాపకుడు టైగర్ కారింగుల నర్సింగరావు గౌడ్ 27వ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం బాలాజీ నగర్ లోని ఆయన విగ్రహానికి కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు,కుల,ప్రజాసంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిరుపేదలకు నివాస స్థలం ఉండాలని పోరాటంతో గుడిసె వాసులకు అండగా నిలిచి నేడు ఎన్నో లక్షల మందికి ఆవాసం గా నిలిచిన గొప్ప వ్యక్తి జవహర్ నగర్ వ్యవస్థాపకుడు కార్మికుల నర్సింగరావు గౌడ్ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ మేకల కావ్య నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ.... గొప్ప వ్యక్తులు ఎప్పుడూ చరిత్రలో స్థిరస్థాయిగా కారింగుల నరసింహారావు గౌడ్ ఇక్కడి ప్రజలందరూ ఎప్పుడు రుణపడి ఉంటారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కారింగుల రాజు గౌడ్,బీఆర్ఎస్ నాయకులు కొండల్ ముదిరాజ్, ప్రసాద్ గౌడ్, సుధాకర్ చారి, కుమ్మరి నరసింహ, నర్ర మహేష్, అహ్మద్ పాషా ,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


