మున్సిపల్ పైన బీజేపీ జెండా ఎగరెయ్యాలి...
మెదక్, ఫిబ్రవరి 03 (ప్రజాస్వరం):
మున్సిపల్ ఎన్నికల పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల కో కన్వీనర్, రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షులు అశోక్ పరమాణి, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఆహ్వాది రంజిత్ మోహన్ మెదక్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా బిజెపి కార్యాలయంలో మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో బిజెపి అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మెదక్ మున్సిపల్ పీఠం పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగుర వేయాలని వారికి పలు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి, మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ ఎంఎల్ఎన్ రెడ్డి, నందా రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, మెదక్ జిల్లా కార్యదర్శి కల్కి నాగరాజు, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్, వార్డు ప్రబారీలు తదితరులు పాల్గొన్నారు.


