ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు కాని రైతులు త్వరగా నమోదు చేసుకోవాలి
వసంతరావు
జగదేవ్ పూర్, జనవరి10 (ప్రజాస్వరం) :
జగదేవ్ పూర్ మండలం తిమ్మాపూర్ మరియు వట్టిపల్లి గ్రామాలలో రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదును మండల వ్యవసాయ అధికారి యు. వసంతరావు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలం లోని రైతులు అందరూ ఈ ఫార్మర్ రిజిస్ట్రీ లో నమోదు చేసుకోవాలని సూచించారు. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న పథకాలు పొందడానికి ఈ రిజిస్ట్రీ నెంబర్ తప్పని సరి అవుతుందని తెలిపారు. ఇప్పటివరకు నమోదు చేసుకొని రైతులకు వారి చరవాణి కి మేసేజ్ పంపించటం జరిగిందని కావున మండలంలో ఇప్పటివరకు నమోదు కానీ రైతులు అందరూ తమ సంభందిత వ్యవసాయ విస్తరణ అధికారి దగ్గర కానీ లేదా సమీప మీ సేవ సెంటర్ (రూ .15/ చెల్లించి) కు వెళ్లి నమోదు చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ సర్పంచ్ పోసానిపల్లి రాజు గ
ఉప సర్పంచ్ అక్కరాజు నాగరాజు, మాజీ సర్పంచ్ తలకొక్కల శ్రీశైలం ,వట్టిపల్లి మాజీ సర్పంచ్ రజిత రాజేందర్ రెడ్డి,
రైతులు అక్కరాజు రాజయ్య, వడ్లకొండ మహేష్, కొంతం కృష్ణంరాజు, వీరబత్తిని రామకృష్ణ, పెద్దులు వ్యవసాయ విస్తరణ అధికారులు కిరణ్ మరియు కృష్ణమూర్తి పాల్గొన్నారు.


