ప్రీమియర్ లీగ్ సీజన్ 3 క్రికెట్ పోటీలను ప్రారంభించిన
సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా
By Prajaswaram
On
రామాయంపేట. జనవరి. 10( ప్రజాస్వరం):
మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో శనివారం కాట్రియాల ప్రీమియర్ లీగ్ సీజన్ 3 క్రికెట్ పోటీలను స్థానిక సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా విన్నర్ కప్ ఆవిష్కరణ చేసిన అనంతరం క్రికెట్ పోటీలను ఆమె ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీర దారుడ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రతిరోజు క్రీడలు ఆడాలని యువతకు సూచించారు. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాబు నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త రాజేందర్ గుప్తా, మాజీ సర్పంచ్ శ్యామ్ వాడు మెంబర్లు తదితరు పాల్గొన్నారు
Latest News
11 Jan 2026 14:24:50
ఆదిలాబాద్ జిల్లా జనవరి 11 (ప్రజాస్వరం):_ కొత్త తెలంగాణ చరిత్ర బృందం హైదరాబాదులోని రవీంద్రభారతిలో నిర్వహించిన చరిత్ర పునర్దర్శనo సదస్సులో ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల హిస్టరీ...


