తపస్ కృషి ఫలితంగా పదవ తరగతి మూల్యాంకన కేంద్రం మంజూరు....
మెదక్, ఫిబ్రవరి 25 (ప్రజాస్వరం):
మెదక్ జిల్లాలో పదవ తరగతి మూల్యాంకన కేంద్రం ఏర్పాటు సంతోషదాయకమని మెదక్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, జాల సిద్దు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో పదవ తరగతి మూల్యాంకన కేంద్రం లేని కారణంగా సంగారెడ్డి జిల్లాలోని బీహెచ్ ఎల్ కి వెళ్లి స్పాట్ లో పాల్గొనాల్సి వచ్చేదనీ అన్నారు. అప్పట్లో మెదక్ జిల్లా ప్రాంత ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బందులు పడేవారని అన్నారు. 10 ఏళ్లుగా తపస్ చేసిన అలుపెరుగని పోరాటం వల్ల ఇప్పుడు మెదక్ జిల్లా కేంద్రంలో స్పాట్ సెంటర్ మంజూరు చేయడం మెదక్ జిల్లా ఉపాధ్యాయుల చిరకాల వాంఛ నెరవేరిందని అన్నారు. మెదక్ జిల్లా కేంద్రానికి పదవ తరగతి మూల్యాంకన కేంద్రం మంజూరుకు సహకరించిన ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే రోహిత్ రావు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మాల్క కొమురయ్య, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెదక్ జిల్లా విద్యాధికారి విజయ లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా లక్ష్మణ్, తపస్ జిల్లా ఉపాధ్యక్షులు తిరునగరి నర్సిములు, శ్రీధర్ రెడ్డి, తపస్ మెదక్, నార్సింగి మండలల అధ్యక్షులు నరేందర్, స్వామి తదితరులు పాల్గొన్నారు.


