నామినేషన్ వేసిన పల్లెర్ల జ్యోతి గుప్తా.......
By Prajaswaram
On
తూప్రాన్, జనవరి 29( ప్రజాస్వరం):
పూర్ణరాజు గౌడ్ ప్రతి నిధి
తూప్రాన్ మున్సిపాలిటీలోని 6వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పల్లెర్ల జ్యోతి రవీందర్ గుప్తా గురువారం మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. గీతా మందిర్ నుండి మహిళలు , యువకులు , వార్డు నాయకులు ర్యాలీ గా వచ్చి నామినేషన్ వేశారు.గత మున్సిపల్ ఎన్నికల లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా పోటీ చేసి విజయం సాధించి సీసీ రోడ్లు , డ్రైనేజి నిర్మాణం చేయించి కొత్త గా సీసీ రోడ్లకు భూమి పూజ చేశాం అని ఆమె అన్నారు బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో అభివృద్ధి కి సహకరించ లేదని ఇప్పుడు కాంగ్రెస్ అధికారం లో ఉందని ప్రత్యేక నిధులతో అన్ని కాలనీ లలో పూర్తి స్థాయి లో అభివృద్ధి చేస్తాం అని జ్యోతి తెలిపారు.
Latest News
08 Feb 2026 19:11:56
జవహర్ నగర్, ఫిబ్రవరి 8,(ప్రజాస్వరం): ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జి తోటపల్లి...


