బోల్తా పడిన కంటైనర్.....

బోల్తా పడిన కంటైనర్.....

 మనోహరాబాద్ , మార్చి 26 (ప్రజాస్వరం ):

 

 మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో జాతీయ రహదారి 44 పై హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ బోల్తా పడింది. దండుపల్లి మనోహరాబాద్ మధ్యలో గల చౌరస్తా వద్ద అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా పడింది. వెంటనే పోలీసులు స్పందించి ట్రాఫిక్ సమస్య రాకుండా చర్యలు చేపట్టారు.