దొంగలించిన 12 ఫోన్లు పట్టుకొని అప్పగించిన ఎసై సుభాష్ గౌడ్ ....

దొంగలించిన 12 ఫోన్లు పట్టుకొని అప్పగించిన ఎసై సుభాష్ గౌడ్ ....

తూప్రాన్ ,మార్చి  26 (ప్రజాస్వరం ):

పూర్ణారాజు గౌడ్ ప్రతినిధి 

 

మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో, Central Equipment Identity Register (CEIR) సహకారంతో పోయిన/దొంగిలించబడిన 12 మొబైల్ ఫోన్లను విజయవంతంగా ట్రేస్ చేసి, సంబంధిత యజమానులకు తిరిగి అప్పగించామని ఎసై సుభాష్ గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సేవ చేయడంలో భాగంగా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ, పోయిన ఆస్తులను తిరిగి అందించడంలో మనోహరాబాద్ పోలీసుల కట్టుబాటును మరోసారి నిరూపించుకునట్లు ఎసై పేర్కొన్నారు .

ప్రజలు తమ మొబైల్ ఫోన్ పోయిన వెంటనే CEIR పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.