మన రాజ్యాంగం ఉన్నతమైనది...
అదనపు కలెక్టర్ నగేష్....
By Prajaswaram
On
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు....
మెదక్ జనవరి 26 (ప్రజాస్వరం):
భారత 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాఠకులను, విద్యార్థిని, విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత గొప్ప రాజ్యాంగం మన భారత రాజ్యాంగం అని ,ప్రతి ఒక్కరు రాజ్యాంగ విలువలకు కట్టుబడి, స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావంతో జీవిస్తూ, ఉత్తమ పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ భుజంగ రావు, జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Latest News
06 Feb 2026 20:57:57
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే...


