రోడ్డు నియమాలు పాటించండి - ప్రమాదాలను నివారించండి....
సర్పంచ్.....
By Prajaswaram
On
జగదేవ్ పూర్, ఏప్రిల్ 13, (ప్రజాస్వరం ):
జగదేవ్పూర్ మండలం వట్టిపల్లి గ్రామంలో సర్పంచ్ విద్యాధర్, ఉపసర్పంచ్ నాగరాజు అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్లపై అతివేగంతో వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భాను, ఎఫ్ఏ రమేష్, అమరేందర్ రెడ్డి, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ పాలకవర్గ సభ్యులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Latest News
13 Apr 2026 19:46:23
మాసాయిపేట, ఏప్రిల్ 13 (ప్రజాస్వరం) : మాసాయిపేట మండలంలోని చెట్లతిమ్మాయిపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక వివిధ గ్రామాల సర్పంచ్...


