అంగన్వాడి కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాసం...
By Prajaswaram
On
చిన్న శంకరంపేట జనవరి 23 ( ప్రజాస్వరం ): చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని మూడవ అంగన్వాడి కేంద్రంలో ఐదు అంగన్వాడి కేంద్రాలకు సంబంధించిన విద్యార్థులకు వసంత పంచమి పురస్కరించుకొని స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ చేతుల మీదుగా అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన చిన్నారులతో అక్షరాల దిద్దించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వసంత పంచమి సరస్వతి మాత పుట్టినరోజు పురస్కరించుకొని చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించడం జరుగుతుందని విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ ఉపసర్పంచ్ భానుప్రసాద్, పాలకవర్గ సభ్యులు పోగుల రాజు, స్వరూప, నవదీప్ రెడ్డి తోపాటు అంగన్వాడి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Latest News
06 Feb 2026 20:57:57
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే...


