తూప్రాన్ సాయిబాబా ఆలయంలో మనోహర్ రెడ్డి ప్రత్యేక పూజలు ....

తూప్రాన్ సాయిబాబా ఆలయంలో మనోహర్ రెడ్డి ప్రత్యేక పూజలు ....

తూప్రాన్, ఏప్రిల్ 9(ప్రజాస్వరం ) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ పట్టణంలోని సాయిబాబా ఆలయంలో గురువారం ఉదయం భక్తి వాతావరణం నెలకొంది. మాజీ జడ్పిటిసి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి సాయిబాబాను దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయంలో పూజా కార్యక్రమాలు ఘనంగా, భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మనోహర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జగదీశ్ కుమార్, విష్ణు, అశోక్ తదితరులను పూజారి ఫూలవతో సత్కరించారు.