ఈనెల 10న జరిగే మోడీ సభను విజయవంతం చేయండి...
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వర్గంటి రామ్మోహన్ గౌడ్ ....
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 7 :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
భారతీయ జనతా పార్టీ ఈనెల 10న సికింద్రాబాద్ ఫేరెట్ గ్రౌండ్లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వర్గంటి రామ్మోహన్ గౌడ్ మున్సిపల్ శాఖ అధ్యక్షులు భూమన్న గారి జానకిరామ్ గౌడ్ పిలుపునిచ్చారు. తూప్రాన్ లోని మమత మినీ ఫంక్షన్ హాల్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తూప్రాన్ మున్సిపల్ కేంద్రం నుండి 1000కి పైగా కార్యకర్తలను తరలించడానికి గ్రామ గ్రామానికి వాహనాలు బస్సుల ఏర్పాట్లు ప్రక్రియ పూర్తి చేశారు బిజెపి అభిమానులు కార్యకర్తలు నాయకులు 10న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని తూప్రాన్ మున్సిపల్ లోని కార్యకర్తలు నాయకులు అభిమానులు ఆదివారం సాయంత్రం జరిగే భారత్ ప్రధాని నరేంద్ర మోడీ గారి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోతరాజు శరత్, రమేష్ గౌడ్, సంపత్ గౌడ్, సాయిబాబా , మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.


