జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ పోటీలకు హాజరైన మాద్రి పృథ్వీరాజ్
By Prajaswaram
On
పటాన్ చెరు, జనవరి 04 (ప్రజా స్వరం)
జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ పోటీలకు మాద్రి పృథ్వీరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మార్షల్ ఆర్ట్స్ క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, స్వీయరక్షణను పెంపొందించే ఉత్తమ క్రీడ అని పేర్కొన్నారు.
యువత క్రీడల వైపు మరింతగా దృష్టి సారించి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు యువ ప్రతిభను వెలికి తీసి, భవిష్యత్తులో దేశానికి గర్వకారణంగా నిలుస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, కోచ్లు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Latest News
12 Apr 2026 21:47:46
తూప్రాన్ ,ఏప్రిల్ 12 (ప్రజాస్వరం ) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగుల పల్లి గ్రామానికి చెందిన అక్కంగారి అక్షర కు...


