అంభేద్కర్ భవన ఖాళీ స్థలాన్ని చదునుచేస్తున్న వారిని అడ్డుకున్న స్థానికులు 

అంభేద్కర్ భవన ఖాళీ స్థలాన్ని చదునుచేస్తున్న వారిని అడ్డుకున్న స్థానికులు 

మేడ్చల్, (ప్రజాస్వరం):

 

మేడ్చల్ సర్కిల్లోని ఇంద్ర నగర్ కాలనీ లో గల సామూహిక అంబేద్కర్ భవనం 1973లో అప్పటి పాలకులు దళితుల కోసం 345 గజాల స్థలాన్ని కేటాయించారు. 1997 లో దళితుల సమావేశాల కోసం 80 గజాలలోశాశ్వత భవనాన్ని నిర్వహించారు. ఆ భవనాన్ని అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి దేవేందర్ గౌడ్ భావన ప్రారంభోత్సవం చేశారు. అనంతరం మండలంలోని దళితులందరికి పలు సమావేశాలు కార్యక్రమాలకు భవనాన్ని ఉపయోగించుకుంటూ వస్తున్నారు. అంబేద్కర్ భవనానికి 345 గజాలు కేటాయించి అందులో 80 గజాలు భవనాల నిర్మాణాలు చేపట్టగా మిగతా స్థలంలో ఇంద్రనగర్ కాలనీవాసులు పెళ్లిళ్లు, శుభకార్యాలు పలు కార్యక్రమాలకు, ఉపయోగించుకుంటూ వస్తున్నారు. కాగా కొందరు వ్యక్తులు ఆ స్థలం మాదే అంటూ బుధవారం నాడు జెసిబి తో స్థలం కబ్జా చేయడానికి ప్రయత్నించడంతో కాలనివాసులు వారిని అడ్డుకొని వెనక్కి పంపారు. అనంతరం వారు మాట్లాడుతూ దళితుల అభివృద్ధి కోసం కేటాయించిన భూమిని కొందరు అక్రమార్కులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని జిహెచ్ఎంసి అధికారులు వెంటనే స్పందించి స్థలాన్ని కాపాడాలని కోరారు. అలాగే కబ్జాకి ప్రయత్నించిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలని వాసులు జీడిపల్లి శివ, రామకృష్ణ, యాదగిరి, లక్ష్మణ్, రావల్కోల్ మహేష్, నల్లవల్లి శ్రీను, మైపాల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు..