క్రీడలను ప్రోత్సహిద్దాం.. మంచి విద్యార్థులను తయారు చేద్దాం ...
ఎంపి ఈటల రాజేందర్....
ప్రజాస్వరం, రంగారెడ్డి : జూన్ 04 :
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ లో నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ -2026 ముగింపు ఉత్సవాల్లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గోన్నారు. విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ తో చేసిన గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థులతో కలిసి ఫోటోలు దిగారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈకాలంలో పొద్దున్నుంచి రాత్రి దాకా చదువు తప్ప ఇంకోటి లేదు. అదొక్కటే సరిపోదు, సంపూర్ణత్వం ఇవ్వదు. విద్యార్థికి తనకాళ్ళ మీద తను నిలబడేలా విద్య ఉండాలి తప్ప.. మార్కులే పరమావధి కాకూడదు. అన్నిటినీ తట్టుకొని నిలబడే మానసిక స్థైర్యం అందించేవి క్రీడలు. ప్రభుత్వంతో పాటు అనేక మంది క్రీడాభిమానులు కలిసి ఈ క్యాంప్ నిర్వహించారు. కోచింగ్ ఇచ్చిన టీచర్లకు, ఓపికగా తీసుకువచ్చిన తల్లిదండ్రులకు, నిర్వాహకులకు, అధికారులకు నా హృదయపూర్వక అభినందనలు. మనం కనకూడని వినకూడని అనేక రుగ్మతలు వెంటాడుతున్నాయి.. వాటి నుంచి దూరం చేయగలిగిన సత్తా క్రీడలకు ఉంది. క్రీడలను ప్రోత్సహిద్దాం మంచి విద్యార్థులను తయారు చేద్దామని అన్నారు.


