అక్రమంగా నీటి వాడకం...

అక్రమంగా నీటి వాడకం...

మాసాయిపేట ఏప్రిల్ 1 (ప్రజాస్వరం):

 

మండలంలోని చెరువు నుంచి అక్రమంగా నీటిని వాడుతున్నట్లు గ్రామస్థులు ఆరోపించారు. మాసాయిపేట శివారులో ఉన్న రామప్ప చెరువు నుంచి రైతుల పంటలకు విడుదల చేస్తున్న నీటిని అక్రమంగా వాడుతున్నట్లు తెలిపారు. కాలువల నుంచి బయటకు వచ్చిన నీటిని మోటార్లతో వాటర్ ట్యాంకులోకి నింపి అమ్మకాలు చేస్తున్నట్లు ఆరోపించారు. అక్రమ నీటి వాడకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.