చైనా మాంజా వాడితే కఠిన చర్యలు..

సీఐ పి.నరేశ్ హెచ్చరిక

చైనా మాంజా వాడితే కఠిన చర్యలు..

అమీన్‌పూర్, జనవరి 31(ప్రజాస్వరం):

పండగ సీజన్‌లో ప్రాణాంతకంగా మారుతున్న చైనా మాంజా వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు అమీన్‌పూర్ పోలీసులు వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అమీన్‌పూర్‌లో శనివారం తులసివనం కాలనీతో పాటు ఐలాపూర్ గ్రౌండ్ వద్ద ప్రజలకు చైనా మాంజా వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి సుమారు 200 మంది కాలనీ వాసులు, యువత పాల్గొన్నారు. గాలిపటాలు ఎగురవేసే సమయంలో పర్యావరణానికి, పక్షులకు, మనుషులకు తీవ్ర హాని కలిగించే సింథటిక్ (చైనా) మాంజాను ఉపయోగించవద్దని పోలీసులు సూచించారు.

ఈ సందర్భంగా అమీన్‌పూర్ ఇన్‌స్పెక్టర్ పి.నరేశ్ మాట్లాడుతూ నిషేధిత చైనా మాంజా విక్రయించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, అటువంటి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్ క్రైమ్ సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Latest News

అశ్రు నయనాల మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రొండా మల్లారెడ్డి అంత్యక్రియలు... అశ్రు నయనాల మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రొండా మల్లారెడ్డి అంత్యక్రియలు...
మేడ్చల్, ఫిబ్రవరి 12 (ప్రజాస్వరం): మేడ్చల్ జిల్లా పూడూరు-కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని పూడూరు గ్రామానికి చెందిన హరిహర నందన అయ్యప్ప స్వామి దేవాలయ ధర్మకర్త,కాంగ్రెస్ పార్టీ సీనియర్...
ఊరేగింపు బాణాసంచా రోడ్డు షోలకు అనుమతి లేదు...
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి...
క్యాంప్ కు తరలిన బీఆర్ఎస్  ... గెలుపు పై ధీమా....
తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి...
ఇందిరమ్మ ఇండ్లు ధ్రువీకరణ పత్రాలు పంపిణి...
ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నిక లు భారీ పోలీస్ బందో బస్తూ....